జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ కు రిమాండ్

విధాత, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ అత్యాచారం కేసులో అరెస్టయ్యారు. పని మనిషిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మురళీముకుంద్ ను అరెస్టు చేశారు.

నాంపల్లి కోర్టు జడ్జి ఇంట్లో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అతని పాస్ పోర్ట్, సెల్ ఫోన్ సీజ్ చేయాలని ఆదేశించారు. మురళీముకుంద్ ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు, ఆయన కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News