అమ్మ‌ర‌మ్మంటుంద‌ని చెప్పి ఆపై అట‌వి ప్రాంతానికి తీసుకెళ్లి..

విధాత‌: పశ్చిమగోదావరి జిల్లాపెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన బాలిక దగ్గరకు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని అత్యాచారం చేయడానికి ప‌థ‌కం వేశాడో అఘాంత‌కుడు. గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకువెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో,నిందితుడు రాకేష్ కూడా భయపడి ఆ బాలికను స్కూలుకు తీసుకు వచ్చి […]

  • Publish Date - October 7, 2021 / 11:56 AM IST

విధాత‌: పశ్చిమగోదావరి జిల్లాపెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన బాలిక దగ్గరకు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని అత్యాచారం చేయడానికి ప‌థ‌కం వేశాడో అఘాంత‌కుడు. గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకువెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో,నిందితుడు రాకేష్ కూడా భయపడి ఆ బాలికను స్కూలుకు తీసుకు వచ్చి వదిలి వెళ్ళిపోయిన ట్టు బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.ఈ అఘాయిత్యానికి పాల్పడిన రాకేష్(18సంవత్సరాలు)కి సహకరించి ఈ అత్యాచారయత్న దుశ్చ‌ర్యను సమర్థిస్తూ గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు మైనర్ బాలికకు నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పించడానికి కేసు లేకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలియ‌డంతో.,.దీనిపై పెద వేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిపారు.నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం వెల్ల‌డించారు.