భర్తను రోక‌లి బండ‌తో కొట్టి చంపిన‌ భార్య

విధాత‌: భర్తను రోకలి బండతో హత్యచేసి, కళ్లుతిరిగి పడిపోయాడని నమ్మించే యత్నంలో తలపై ఉన్న గాయాలు చూసి మృతుడి అన్న ఫిర్యాదుతో బండారం బట్టబయలైన ఘటన తాడికొండలో చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం కథనం మేరకు.. తాడికొండకు చెందిన చిలకా రమేష్‌ కు అదే గ్రామానికి చెందిన నిర్మలతో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తాడికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గార్డుగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌కు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి కోలుకున్నాడు.అయితే అప్పటి […]

  • Publish Date - August 23, 2021 / 12:14 PM IST

విధాత‌: భర్తను రోకలి బండతో హత్యచేసి, కళ్లుతిరిగి పడిపోయాడని నమ్మించే యత్నంలో తలపై ఉన్న గాయాలు చూసి మృతుడి అన్న ఫిర్యాదుతో బండారం బట్టబయలైన ఘటన తాడికొండలో చోటుచేసుకుంది.

మంగళగిరి రూరల్‌ సీఐ భూషణం కథనం మేరకు.. తాడికొండకు చెందిన చిలకా రమేష్‌ కు అదే గ్రామానికి చెందిన నిర్మలతో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. తాడికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గార్డుగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌కు ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చి కోలుకున్నాడు.అయితే అప్పటి నుంచి కుటుంబంలో కలహాలు రేగుతుండటం పరిపాటిగా మారి గతంలో రెండుసార్లు భార్య తనపై హత్యాయత్నం చేసిందని మృతుడు రమేష్‌ తన అన్నకు చెప్పాడు.