విధాత: ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమన్నాయి. నిత్యావసర ఆహార పదార్థాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 90శాతం పెరిగి రూ.2,657కు చేరింది. ఇక కేజీ పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.