Dalit Bandhu |
విధాత: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం రెండో విడత నిధుల విడుదలకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ పథకంలో భాగంగా ఈ దఫా ప్రతీ నియోజకవర్గంలో 1115 మందికి, 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి ఈ పథకం అమలు చేయనున్నారు.
రెండో విడుత ఉత్తర్వుల జారీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్లు పథకం లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలనీ సూచించారు. రానున్న ఎనిమిదేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.