Site icon vidhaatha

మగువలకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Gold Rates | మహిళలకు గుడ్‌న్యూస్‌. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు బహిరంగ మార్కెట్‌లో స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 తగ్గి తులానికి రూ.58,500 పలుకుతున్నది. 24 క్యారెట్ల పుత్తడి రూ.270 పెరిగి తులం రూ.63,820కి ఎగిసింది. మరో వైపు వెండి ధర సైతం స్వల్పంగా దిగివచ్చింది. కిలోకు రూ.300 పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.58,560 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.63,970కి తగ్గింది.


ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,970కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.64,530 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,820 ధర పలుకుతున్నది. ఇక ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ధరలు ఇవే కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి సైతం స్వల్పం దిగివచ్చింది. రూ.300 తగ్గి కిలో ధర రూ.78,600కి తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80వేలకు చేరింది.

Exit mobile version