Mallu Ravi
విధాత, గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవ్వడాన్ని నిరసిస్తు రేపు శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడించనున్నామని, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలుపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్లు ప్రజల వరద కష్టాల పట్ల నిర్లక్ష్యం వహించడంతో జంటనగరాల్లో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వర్షాలు, వరదలతో బాధలు పడుతున్న ప్రజలకు అండగా నిలువాలన్నారు.