MP VenkatReddy | కేసీఆర్‌కు ఎన్నికలపై ధ్యాస తప్ప.. జనం గోడు పట్టదు: ఎంపీ వెంకట్‌రెడ్డి

MP VenkatReddy పంచాయతీ వర్కర్ల సమ్మెకు ఎంపీ వెంకట్‌రెడ్డి మద్దతు విధాత: సీఎం కేసీఆర్ కు ఎన్నికలపై ధ్యాస తప్ప జనం గోడు పట్టించుకోవడం లేదంటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గ్రామ పంచయతీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెశనివారం 31వ రోజుకు చేరుకోగా వారికి వెంకట్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని, కరోనా సమయంలో ఎంతో సేవ చేశారన్నారు. నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, సీఎం […]

  • Publish Date - August 5, 2023 / 12:36 AM IST

MP VenkatReddy

  • పంచాయతీ వర్కర్ల సమ్మెకు ఎంపీ వెంకట్‌రెడ్డి మద్దతు

విధాత: సీఎం కేసీఆర్ కు ఎన్నికలపై ధ్యాస తప్ప జనం గోడు పట్టించుకోవడం లేదంటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గ్రామ పంచయతీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెశనివారం 31వ రోజుకు చేరుకోగా వారికి వెంకట్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని, కరోనా సమయంలో ఎంతో సేవ చేశారన్నారు.

నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురుచూస్తుంటారని విమర్శించారు. కనీస వేతనం అమలు చేయాలని కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపేది లేదన్న కేసీఆర్ ఇప్పుడు విలీనం అంటున్నారన్నారు.

కేసీఆర్‌కు ఓటమి భయం ఎక్కువైందని, అందుకే ఇలా చేస్తున్నారన్నారు. ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, పంచాయతీ కార్మికుల జీతం పెంచుతామన్నారు. కేసీఆర్ కు ఆయన కొడుకు, కూతురు బాగుంటే చాలు అని, మీది న్యాయమైన కోరిక అని, మీకు న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటానని వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. బంధుల సాయం పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని, బీఆరెస్ బంద్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

Latest News