Sankranti Special Trains | సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 32 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది. జనవరి 7 నుంచి 27 మధ్య ఆయా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, విశాఖపట్నం-కర్నూల్ సిటీ, కాకినాడటౌన్-సికింద్రాబాద్, తిరుపతి – సికింద్రాబాద్ తదితర మార్గాల్లో ఈ ప్రత్యేక రూళ్లు నడుస్తాయని తెలిపింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
ఈ రైళ్లు పరుగులు తీసేది ఈ రూట్లలోనే..
సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089) మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) ఈ నెల 8, 15 తేదీల్లో, వికారాబాద్-బ్రహ్మపూర్ (07091 ) మధ్య జనవరి 9, 16 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్-సికింద్రాబాద్ (07092) రైలు ఈ నెల 10, 17న పరుగులు తీయనున్నాయి. విశాఖపట్నం నుంచి కర్నూల్ సిటీ (08541) మధ్య ఈ నెల 10, 17, 24వ తేదీల్లో.. కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) మధ్య ఈ నెల 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. శ్రీకాకుళం-వికారాబాద్ (08547) మధ్య ఈ నెల 12, 19, 26 తేదీల్లో.. వికారాబాద్- శ్రీకాకుళం (08548) మధ్య ఈ నెల 13, 20, 27న పరుగులు తీస్తాయని చెప్పింది.
సికింద్రాబాద్-తిరుపతి (02764) మధ్య ఈ నెల 10, 17 తేదీల్లో.. తిరుపతి -సికింద్రాబాద్ (02763) మధ్య ఈ నెల 11, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పింది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) మధ్య ఈ నెల 12న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) మధ్య 13న నడువనున్నాయి. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) మధ్య ఈ నెల 8, 15 తేదీల్లో నడువనునండగా.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) మధ్య 9, 16 తేదీల్లో పరుగులు పెట్టనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) మధ్య నెల 10న, సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) మధ్యన 11న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024
ఏ రైలు ఎక్కడ ఆగుతుందంటే..
రైలు నంబర్ 07089-07090, 07091-07092 ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్చాపురం మధ్య ఆగుతాయని తెలిపింది. 08541-0842 ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం- కర్నూలు సిటీ రైళ్లు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, కాచిగూడ, ఉమ్దానగర్ , షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టేషన్లలో ఆగుఆయని పేర్కొంది. 08547-08548 నంబరు గల శ్రీకాకుళం – వికారాబాద్ రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగనున్నాయి.
సికింద్రాబాద్-తిరుపతి (02764-02763) ట్రైన్స్ జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్ – కాకినాడ ( 07271) రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07272) రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-బ్రహ్మాపూర్- సికింద్రాబాద్ (07093-07094) రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, పి. అన్నవరం, పి. కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లు ఇరువైపులా ఆగనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) స్పెషల్ ట్రైన్ పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతాయని రైల్వేశాఖ వివరించింది.