జూలై 10- లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు లడక్లోని సిరిగపోల్ సమీపంలో పెట్రోలింగు చేస్తున్న పోలీసులు ఈ బంగారం పట్టుకున్నారు. డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలో బలగాలు వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలో ఈ బంగారం స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి బంగారంతోపాటు మొబైల్ ఫోన్లు, కత్తులు, బైనాక్యులర్స్, చైనా తినుబండారాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. బంగారం విలువ 84 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా.
ఎల్ఏసీ వద్ద 108 కిలోల బంగారం పట్టివేత
లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Latest News
ఇరాన్ యుద్ధనౌకను పేల్చేసిన అమెరికా.. శ్రీలంక సముద్రంలో ఘోర విషాదం, 87 మృతి!
టి20 ప్రపంచకప్ సెమీఫైనల్: ఫిన్ అలెన్ మెరుపు సెంచరీ – ఫైనల్లో న్యూజీలాండ్
వంట విషయంలో అత్తతో గొడవ.. టెకీ కోడలు బలవన్మరణం
అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం: హైడ్రా కమిషనర్
వరంగల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం : ఇక ఐపీఎల్ మ్యాచ్లూ చూడొచ్చు.
నియోపోలిస్లో సీఎం మేనల్లుడి మనుషుల అక్రమ మైనింగ్
సుస్మిత సంగతి తెలుసుగా... కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు...
బెంగళూరు టూ హైదరాబాద్ ప్రయాణం.. ఇక రెండు గంటలే
టీడీఆర్పై రేవంత్ సర్కార్ యూటర్న్? మహారాష్ట్ర విధానం అమలు దిశగా కసరత్తు!
రెండు రాజ్యసభ స్థానాలకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు!