జూలై 10- లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు లడక్లోని సిరిగపోల్ సమీపంలో పెట్రోలింగు చేస్తున్న పోలీసులు ఈ బంగారం పట్టుకున్నారు. డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ నాయకత్వంలో బలగాలు వాస్తవాధీన రేఖకు కిలోమీటరు దూరంలో ఈ బంగారం స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి బంగారంతోపాటు మొబైల్ ఫోన్లు, కత్తులు, బైనాక్యులర్స్, చైనా తినుబండారాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. బంగారం విలువ 84 కోట్ల రూపాయలవరకు ఉంటుందని అంచనా.
ఎల్ఏసీ వద్ద 108 కిలోల బంగారం పట్టివేత
లడక్లోని భారత-చైనా సరిహద్దులో108 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు భారత-టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగం ప్రకటించింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు బిస్కట్లను సరిహద్దు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Latest News
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం