ముంబై: అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నది. శ్రీదేవి మృతిపై తనకు లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త బోనీ కపూర్ ఇటీవల న్యూ ఇండియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దుబాయి పోలీసులు తనను 48 గంటల పాటు ఇంటరాగేట్ చేశారని చెప్పారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలోని ఒక హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో మునిగి మరణించిన విషయం విదితమే. ‘మంచిగా కనిపించడం కోసం ఆమె తరచూ ఉపవాసాలు చేసేది. అప్పుడప్పుడు కళ్లు తిరిగి పడిపోయేది’ అని ఆయన చెప్పారు. ఆమె మరణంపై అప్పట్లో రకరకాల అనుమానాలు, కుట్ర కథనాలు వెలువడ్డాయి. ‘తను తన మంచి శరీరాకృతిని కాపాడుకోవడానికి తపించేది. స్క్రీన్పై మంచిగా కనిపించాలన్న తాపత్రం ఉండేది’ అని ఆయన చెప్పారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత రెండు మూడు సందర్భాల్లో తను కళ్లు తిరిగి పడిపోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఆమెకు లోబీపీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పేవారని కూడా తెలిపారు. ఆమె నిత్యం ఉప్పు లేని ఆహారమే తీసుకునే వారని చెప్పారు. ‘అది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు జరిగిన మరణం. నేను 24 లేక 48 గంటలు ఇదే అంశంపై ఇంటరాగేషన్లో మాట్లాడాను. అందుకే బయట మాట్లాడలేదు. భారత మీడియా నుంచి విపరీతంగా ఒత్తిడి ఉందని, ఇలా దర్యాప్తు చేయకతప్పడం లేదని అధికారులు చెప్పారు. లై డిటెక్టర్ పరీక్షతో సహా అన్ని పరీక్షలకూ నిలబడ్డాను. ఇందులో ఎటువంటి కుట్రా లేదని నిర్ధారణకు వచ్చారు. అది ప్రమాదవశాత్తు జరిగిందేనని నివేదిక వచ్చింది’ అని బోనీ కపూర్ చెప్పారు. శ్రీదేవి అంతకుముందు కూడా ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కళ్లుతిరిగి పడిపోయినట్టు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన హీరో నాగార్జున చెప్పారని బోనీ కపూర్ తెలిపారు.
శ్రీదేవి మృతిపై బోనీ కపూర్కు లై డిటెక్టర్ టెస్ట్ .. భర్త చెప్పిందేంటో తెలుసా?
అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నది. శ్రీదేవి మృతిపై తనకు లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త బోనీ కపూర్ ఇటీవల న్యూ ఇండియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు

Latest News
అనంత్ అంబానీ ‘వంతారా’ థీమ్తో లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..!
‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్కు రంగం సిద్ధం..
నొయిడాలో చనిపోయిన టెక్కీ యువరాజ్ మెహతా ఆఖరి క్షణాలు.. గుండెను పిండేసే వీడియో..
రుషికొండ సముద్ర తీరంలో తిమింగలంతో స్కూబా డైవర్స్ సాహసం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...త్వరలో కేసీఆర్ కు నోటీసులు?
కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ..
మరో చరిత్ర సృష్టించబోతున్న భారత నారీ..గణతంత్ర వేడుకలే వేదిక!
వైట్కాలర్ ఉద్యోగాలకు ఏఐ ముప్పు.. హెచ్చరించిన బిల్ గేట్స్
మేడారం జాతరలో తులాభారం వివాదం..
‘వెల్కమ్ టు రాజస్థాన్’.. షకీరా వాకా వాకా పాటను ప్రత్యేక వెర్షన్లో పాడిన జానపద కళాకారులు.. ఆకట్టుకుంటున్న వీడియో