న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ కులానికి సంబంధించిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి అనురాగ్ఠాకూర్ మంగళవారం లోక్సభలో చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంలో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. రాహుల్గాంధీకి, అనురాగ్ ఠాకూర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. అయితే.. ఈ ఉపన్యాసం వీడియోను ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇది తప్పనిసరిగా చూడాల్సిన వీడియో అంటూ దానిని అప్లోడ్ చేశారు. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బుధవారం నోటీసును ఇచ్చింది. ఇదే అంశంపై బుధవారం కూడా సభలో తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేతపై చేసిన వ్యాఖ్యల విషయంలో అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దేశంలో కుల గణన నిర్వహించాలన్న డిమాండ్ను పునరుద్ఘాటించాయి. ఈ గందరగోళం నడుమ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది.
Lok Sabha | ప్రధానిపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ కులానికి సంబంధించిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి అనురాగ్ఠాకూర్ మంగళవారం లోక్సభలో చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Latest News
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
ఫారెస్టు అధికారులకు సవాల్: అడవులు మార్చినా.. బుద్ది మార్చుకోని పెద్దపులి !
“ఈ కోపం అంతా ఒకప్పుడు ప్రేమే” — విజయ్ దేవరకొండ భారీ చిత్రం
హర్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్
క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్తో మెస్మరైజ్ చేసిన నయనతార..
దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది : వైఎస్. షర్మిల
మంత్రి లోకేశ్ చొరవ..పునర్వికకు పునర్జన్మ..!
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం చారిత్రాక తప్పిదం : జయప్రకాశ్ నారాయణ్
మహేష్–రాజమౌళి ‘వారణాసి’ కోసం ప్రత్యేక గీతం...
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్రోహం : సీఎం చంద్రబాబు