విధాత : మహారాష్ట్ర – రాయ్ఘడ్లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సామాజిక మాద్యమాల్లో హెలిక్యాప్టర్ కూలిపోతున్న వీడియోలు వైరల్గా మారాయి. ప్రమాద స్థలంలో హెలిక్యాప్టర్ విడిభాగాలు పడిన తీరు ప్రమాద తీవ్రతను చాటాయి. అయితే ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యం చూసిన వారు గతంలో ఎన్నికల ప్రచారంలో హెలిక్యాప్టర్ కూలి సినీ నటి సౌందర్య మరణించిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూలిన హెలిక్యాప్టర్.. తప్పిన ప్రాణ నష్టం
మహారాష్ట్ర - రాయ్ఘడ్లోని మహద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెలుతున్న శివసేన మహిళా నాయకురాలు సుష్మా అంధారే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది.

Latest News
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు
అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ
ఇరిగేషన్ అధికారి కూతురు పెళ్లి ఖర్చు వివాదం..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
విడాకుల రూమర్స్కు చెక్..
తెలుగు లోగిలి బంగారు గని జొన్నగిరి..మే నుంచి మైనింగ్ షురూ
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత