Jr NTR| బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో వ‌చ్చిన ఎన్టీఆర్.. కొత్త లొల్లి మొద‌లైందిగా..!

Jr NTR| ఏపీ, తెలంగాణ‌లో ఓటింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఉద‌యం 7గంట‌ల నుండే ప్ర‌జ‌లు పోలింగ్ బూత్ ద‌గ్గ‌రకు ప‌రుగులు పెట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రా

  • Publish Date - May 13, 2024 / 10:51 AM IST

Jr NTR| ఏపీ, తెలంగాణ‌లో ఓటింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఉద‌యం 7గంట‌ల నుండే ప్ర‌జ‌లు పోలింగ్ బూత్ ద‌గ్గ‌రకు ప‌రుగులు పెట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రాజ‌మౌళి,తేజ , కీర‌వాణి కార్తికేయ‌ లాంటి సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే జూ.ఎన్టీఆర్ త‌న త‌ల్లి, భార్య‌తో కలిసి ఉదయాన్నే జూబ్లీహిల్స్‌ కేంద్రానికి చేరుకొని ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఓటు ప్ర‌తి ఒక్క‌రు వినియోగించుకోవల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని, ఇది మనం రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశమంటూ ఆయ‌న తెలియ‌జేశారు.

అయితే ఓటు వేసేందుకు ఎన్టీఆర్ బ్లూ క‌ల‌ర్ రంగు ష‌ర్ట్ ధ‌రించి క‌ళ్ల‌కు న‌ల్ల‌ద్దాలు పెట్టుకొని వ‌చ్చారు. దీనిని కొంద‌రు హైలైట్ చేస్తూ.. ఎన్టీఆర్ బ్లూ క‌ల‌ర్ రంగు వేసుకొచ్చాడు కాబ‌ట్టి ఆయ‌న వైసీపీ పార్టీకి మ‌ద్దతు ఇస్తున్నాడ‌ని, అందుకే ఆ రంగు ష‌ర్ట్ ధ‌రించి వచ్చాడ‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవ‌ల జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఎల్లో, రెడ్ బార్డ‌ర్‌తో ఉన్న శారీని క‌ట్టుకొని టీడీపీ, జ‌న‌సేన‌కి స‌పోర్ట్ చేసిందని కొంద‌రు ప్ర‌చారం చేశారు. అప్పుడు ష‌ర్మిళ‌, ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల‌కి కాకుండా ప్ర‌తిపక్షంలో ఉన్న వారిని స‌పోర్ట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాగా దేవ‌ర అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అక్టోబర్ 10న విడుదలకానున్న ఈ సినిమాకి సంబంధించి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. ఈ చిత్రాన్ని సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్.. హృతిక్ రోష‌న్‌తో క‌లిసి వార్‌2 అనే చిత్రం చేస్తున్నాడు.

Latest News