తమిళనాడులోని తిరుచ్చి నుండి షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(Air India Express) AXB-613 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం హైడ్రాలిక్ వ్యవస్థ(Hydraulic System)లో లోపం ఏర్పడటంతో చక్రాలు పూర్తిగా మూసుకోకపోవడంతో మామూలుగా ల్యాండింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing)కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విమానాన్ని నడుపుతున్న పైలట్(Pilot) ఎంతో సాహసంతో, తన అనుభవాన్ని ఉపయోగించి రన్వే పైనే సురక్షితంగా విమానాన్ని దింపాడు. ఇందులో ఎవరికీ ఎటువంటి హానీ జరుగలేదు. ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు(All are safe).
ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AXB-613 విమానంలో 140 మంది ప్రయాణీకులు (140 Passengers) న్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదని గ్రహించిన పైలట్ గ్రౌండ్కు ఎమర్జెన్సీ సందేశం పంపించాడు. చక్రాలు పూర్తిగా మూసుకోకపోవడం వలన సాధారణ ల్యాండింగ్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఎమర్జెన్సీ ల్యాండింగ్ మాత్రమే చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి. కానీ ఇతర మార్గాలేవీ లేవు. రన్వేకు సమాంతరంగా విమానాన్ని నడుపుతూ, మెల్లగా రన్వే మీదకు విమానాన్ని దింపాలి. ఆలా క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు ఏదైనా జరగొచ్చు. ముందు జాగ్రత్తగా 20 అగ్నిమాపక యంత్రాలు, 20 అంబులెన్సులు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ప్రతీ సెకండ్ విమానం పైలట్, గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడుతూ, చాలా చాకచక్యంగా విమానాన్ని ఎయిర్పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. అయితే తలెత్తిన సమస్య ఎలాంటిది? ఎలా పరిష్కరించారనేది తెలియాల్సిఉంది. మొత్తానికి 140 మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉండటంతో అంతా సంతోషించారు.