Rama Setu | విధాత : రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నోటీసులిచ్చింది. హిందూ పురాణాల ప్రకారం సీతను రక్షించడానికి రాముడు, వానర సైన్యం లంకకు వెళ్లడానికి రామసేతును నిర్మించిందని చెబుతారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలం విశ్వాసానికి సంబంధించిన విషయమని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 2005 నుండి ఈ వంతెన వివాదంలో చిక్కుకుంది, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ ఛానల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. అయితే షిప్ఫింగ్ ఛానల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్లో ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ ఆయన గతంలోనే పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Rama Setu | నాలుగు వారాల్లో సమాధానమివ్వాలి.. రామసేతు జాతీయ హోదాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Rama Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Latest News
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది ...
ఆర్తి అగర్వాల్ మరణానికి అసలు కారణాలు ఏంటి...
నా కొత్త పార్టీలోకి భారీగా చేరికలు : కల్వకుంట్ల కవిత
ఇక ఏపీలో ‘ప్రాజెక్ట్ పునర్విక’: మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
కన్నడ నేలపై మళ్లీ శివాంగి(చిరుత)ల పునరాగమనం!
లెన్స్కార్ట్ క్షమాపణలు.. బొట్టు, హిజాబ్, తిలకాలకు గ్రీన్ సిగ్నల్!
ఇప్పుడు నీ తోలు తీయాలా రేవంత్ రెడ్డి? : హరీశ్ రావు
ఏప్రిల్ 22 దాకా తెలంగాణలో విచిత్ర వాతావరణం : రోజూ ఎండలు, వానలు
బీచ్ లో ఆలల చెంత సింహం..ఫోటో, వీడియో వైరల్
హాట్ టాపిక్...గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!