Rama Setu | విధాత : రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నోటీసులిచ్చింది. హిందూ పురాణాల ప్రకారం సీతను రక్షించడానికి రాముడు, వానర సైన్యం లంకకు వెళ్లడానికి రామసేతును నిర్మించిందని చెబుతారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్థలం విశ్వాసానికి సంబంధించిన విషయమని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 2005 నుండి ఈ వంతెన వివాదంలో చిక్కుకుంది, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం సేతుసముద్రం షిప్పింగ్ ఛానల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. అయితే షిప్ఫింగ్ ఛానల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్లో ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ ఆయన గతంలోనే పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Rama Setu | నాలుగు వారాల్లో సమాధానమివ్వాలి.. రామసేతు జాతీయ హోదాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Rama Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Latest News
మే నుంచి అందుబాటులోకి మరో గ్రీన్ ఫీల్డ్ హైవే.. విశాఖ, హైదరాబాద్ మధ్య తగ్గనున్న దూరాభారం
ఏం మేకోవర్ భయ్యా.. కలర్ఫుల్ శారీలో మృణాల్ అందాలు
హాట్ ఫొటోలతో హీట్ పెంచేసిన నిధి.. థండర్ థైస్ షో
అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం లక్ష్యం
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
హెలికాప్టర్ పెయింటింగ్తో.. ఇజ్రాయెల్ను బురిడీ కొట్టించిన ఇరాన్! వైరల్ వీడియో
Free Bus | ఫ్రీ బస్సును ఇలా కూడా వాడేస్తున్నారా.. బస్సులోనే బ్రష్ చేసిన మహిళ.. వీడియో వైరల్
Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
Realme | రేపే మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
ప్రాంతీయ పార్టీలకు మోదీ గండం.. బీహార్లో నితీశ్ పార్టీకి ముగింపేనా!