విధాత, వరంగల్: ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నర్సింహులపేట మండలం దుబ్బతండాకి చెందిన జాటోతు రమేష్ అనే రైతు బొడ్లాడ గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన మొక్క జొన్నకంకులను ట్రాక్టర్ లో తొలుతూ ఆ ట్రాలీని ఒక దగ్గర ఆన్ లోడ్ చేస్తుండగా లేచిన ట్రాలీ కిందకు దిగపోయే సరికి ట్రాలీ కింద ఉన్న జాకీ పైపును లూజు చేయగా ఒక్కసారిగా అతనిపై పడటంతో మృతి చెందారన్నారు.