Site icon vidhaatha

Brain-eating Amoeba | బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కేరళలో ఐదో మరణం! ఏమిటీ ప్రాణాంతక అమీబా?

Brain-eating Amoeba | ప్రాణాంతకమైన బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా (Naegleria fowleri) సోకి ఈ నెలలో భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఐదవ మరణం చోటు చేసుకుంది. మళప్పురం జిల్లా వాండూర్‌ సమప తిరువాళి గ్రామస్థురాలైన శోభన అనే 56 ఏళ్ల మహిళ ఈ ఇన్ఫెక్షన్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. గతవారం ఆమెను హాస్పిటల్‌లో చేర్చినప్పటి నుంచీ ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నది. సెప్టెంబర్‌ 6, 2025న కూడా వాయనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బతేరీకి చెందిన రతీశ్‌ అనే 45 ఏళ్ల వ్యక్తి కూడా ఇదే బాక్టీరియా (Brain-eating Amoeba)  సోకి చనిపోయాడు. 2025 ఆగస్ట్‌ నెల నుంచి ఇప్పటి వరకూ ఈ బాక్టీరియాలో ఐదుగురు చనిపోవడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నది. అంతేకాదు.. ఇదే వ్యాధితో కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో మరో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు హాస్పిటల్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సంవత్సరం బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా కేసులు ఒక్క కేరళలోనే 42 వరకూ గుర్తించారు.

ఏమిటీ బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా?

వైద్యపరిభాషలో ప్రైమరీ అమీవిక్‌ మెనింగోఎన్సెఫలిటీస్‌ (PAM) (https://en.wikipedia.org/wiki/Primary_amoebic_meningoencephalitis) అని పిలువబడే ఈ వ్యాధి Naegleria fowleri అనే సూక్ష్మ జీవి వల్ల సోకుతుంది.
ఇది ఎక్కువగా వేడి నీటిలో అంటే.. సరస్సులు, నదులు, హాట్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో వృద్ధి చెందుతుంది.
46 డిగ్రీల సెల్షియస్‌ వేడిలో కూడా ఇది బతికి ఉంటుంది.

మనుషులకు ఎలా సోకుతుంది?

Exit mobile version