విధాత: శ్రీశైలం జలాశయం క్రస్ట్గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో ఈరోజు 10 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. జలాశయం నీటిమట్టం గురువారం రాత్రి 7 గంటలకు 588.20 అడుగులకు చేరగా ఇది 306.6922 టీఎంసీలకు సమానం.