తీన్మార్ మల్లన్న విడుదలకై అఖిలపక్ష సమావేశం

విధాత‌: హైదరాబాద్ లోని సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్ల న్న విడుదలకై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. బిజెపి కోర్ కమిటీ సభ్యుడు జి. వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ మల్లురవి, జర్నలిస్ట్ యాదగిరి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్ల న్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు డా. జి.వివేక్ వెంకటస్వామి కామెంట్స్: రాష్ట్రంలో రజాకార్ల […]

  • Publish Date - September 8, 2021 / 09:54 AM IST

విధాత‌: హైదరాబాద్ లోని సోమాజిగూడ,ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్ల న్న విడుదలకై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. బిజెపి కోర్ కమిటీ సభ్యుడు జి. వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ మల్లురవి, జర్నలిస్ట్ యాదగిరి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్ల న్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు డా. జి.వివేక్ వెంకటస్వామి కామెంట్స్: రాష్ట్రంలో రజాకార్ల పాలన జరుగుతుంది. కెసిఆర్ రాష్ట్రంలో ప్రజల గొం తు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర సర్కార్ మల్లన్న పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. మల్లన్న హుజరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పంచుతున్న డబ్బులను ఎండగడతాడనే నెపంతో పాదయాత్ర చేయకుండా అడ్డుపడి అరెస్టు చేయించాడు. టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కేసీఆర్ మల్లన్న పాదయాత్ర చేయకుండా అడ్డుపడి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారు. పోలీసు వాళ్ళు క్యూ న్యూ స్ ఉద్యోగులపై దుర్భాషలు మాట్లాడుతున్నారు. కెసిఆర్ ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలు కేసీఆర్ పై తిరుగుబాటు చేసే టైం దగ్గర పడుతుంది. కెసిఆర్ చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి అందరు కలిసి పని చేయాలని సూచించారు

Latest News