హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ కుంభకోణం కేసును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. అక్రమ మార్గంలో 75 కంపెనీలకు 1400 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతకు అవకాశం కల్పించారన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో సీసీఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టు వార్తలొస్తున్నాయి. 75 కంపెనీలు/పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆన్లైన్లో కనిపించకుండా చేసి, పన్ను ఎగవేసేందుకు అవకాశం కల్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్కుమార్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన వ్యవహారంపైనా విచారణ కొనసాగుతున్నది. సోమేశ్కుమార్పై, కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని మరో ఇద్దరు సీనియర్ అధికారులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Commercial Tax Scam | సీఐడీకి కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసు
కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ కుంభకోణం కేసును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. అక్రమ మార్గంలో 75 కంపెనీలకు 1400 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతకు అవకాశం కల్పించారన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
ఇరాన్ దాడులు.. ముగ్గురు భారతీయులు మృతి
ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనం ఆక్షేపణీయం : సోనియాగాంధీ
అబ్బా అనిపించేలా నభా.. నభాను ఇలా చూస్తే గుండెజారి గల్లంతే
ప్రజలకొక న్యాయం..మంత్రికి, అల్లుడికి మరో న్యాయమా ?: హరీశ్ రావు
నేడు చంద్రగ్రహణం: ఆలయాల మూసివేత..అక్కడ తెరిచే ఉంటాయి!
టైట్ ఫిట్ డ్రెస్లో భాగ్య శ్రీ.. సాలీడ్ ఫోజులతో మతిపోగుడుతున్న ముద్దుగుమ్మ
ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో విషాదం..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఇరాన్పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
నిధి అగర్వాల్ అందాల అలజడి