విధాత, వరంగల్ ప్రతినిధి: రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గత పది సంవత్సరాలలో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రేవంతన్న నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వరికి బోనస్ ఇచ్చామన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశామన్నారు. అదే తరహాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోలు చేస్తున్నామని, నాణ్యమైన పత్తి తీసుకొని వచ్చి మంచి ధరను పొందాలని సూచించారు. కిసాన్ యాప్ ద్వారా బుక్ చేసుకుని యాప్ నిర్ధారించిన సమయం తేదీకి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని పోవాలని సూచించారు. టీటీడీ తరహాలో యాప్ ను రూపొందించారని, సీసీఐకి పత్తి అమ్మితే వారం రోజుల లోపు రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. 23 మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నారని, 12 శాతం లోపు ఉన్న పత్తిని కొనుగోలు చేస్తారని, పట్టా పాస్ బుక్ తీసుకొని వస్తేనే కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. ఎఈవో ద్వారా జరిగే ఈ పత్తి కొనుగోలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవిందర్ రెడ్డి, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.
Konda Surekha : రైతు సంతోషంగా ఉంటే రాష్టం సుభిక్షం
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్లతో రైతులకు లాభం చేకూరుతోందన్నారు.

Latest News
భారత్–పాక్ మ్యాచ్కు వాన ముప్పు.. రద్దయితే ఏంటి పరిస్థితి?
‘హంగ్’ మున్సిపాలిటీలు హస్తగతం?.. బీఆర్ఎస్ ఎత్తుకు కాంగ్రెస్ పై ఎత్తులు
ఆ బాంబు పేలితే.. మనిషి క్షణాల్లో బూడిదే.. ! గాజాలో ఆనవాళ్లు!
Dowry | రూ.31 లక్షల కట్నం తిరస్కరించిన వరుడి కుటుంబం.. సర్వత్రా ప్రశంసలు
TVK Vijay | ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. విజయ్ని చూసిన ఆనందంలో గంతులేసిన యువతి.. Video
Hardik Pandya | వాలెంటైన్స్ డే.. గర్ల్ఫ్రెండ్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. అదేంటంటే..?
సీఎం రేవంత్ రెడ్డి మాటలు అహంకార పూరితం : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మున్సి‘పోల్స్’.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్?
సంక్షోభం అంచున తెలంగాణ? రిజర్వ్ బ్యాంకు హెచ్చరికలు పట్టని పాలకులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్ : ఏపీ సీఎం చంద్రబాబు