విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలో అయ్యప్ప ఆలయంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్, న్యాయవాది జీవన్ రావు స్వామి ఆదివారం ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజా మహోత్సవంలో మెదక్ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పడిపూజ గురుస్వామి టిపి హరిదాస్, ఆలయ ప్రధాన అర్చకులు వైద్య రాజు పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వారి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప,చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వైస్ చైర్మన్ ఆరెళ్ళ మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగాధర్ గడ్డమీద కృష్ణ గౌడ్, రామాయం పేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మరియు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.