విధాత, హైదరాబాద్ : నాగార్జున సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి పడింది. అనుముల(హాలియా) మండలం మారేపల్లి వద్ద గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈనెల 2న జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు ఈ కాలువకు నీటి విడుదల చేశారు. ఇంతలోనే గండి పడటంతో కాలువ నిర్వాహణ తీరు పట్ల అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువకు మరమ్మతులు లేకపోవడంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకే కాలువకు గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ కాలువ ద్వారా 200 చెరువులకు నీరు చేరనుండగా, సుమారు 250 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ వరద కాలువకు 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. కాలువలో బండరాళ్లు, కంపచెట్లు తొలగించకపోవడం వలన గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు. కాగా ఏఎమ్మార్పీ డీఈ గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టి నీటి విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
Nagarjuna Sagar | సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి.. నీటి విడుదల నిలిపివేత
నాగార్జున సాగర్ లోలెవల్ వరద కాలువకు గండి పడింది. అనుముల(హాలియా) మండలం మారేపల్లి వద్ద గండి పడటంతో నీరు వృధాగా పోతుంది. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు.

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు