విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారు.
రమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.. ఇతనే కుమారస్వామి అనుకోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించి, నిన్న తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సిబ్బంది రేపు రమ్మని పంపించారు. ఈరోజు కుటుంబసభ్యులు వెళ్లగా కుమారస్వామి బ్రతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్

Latest News
తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు
ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం
21 ఏళ్లకే సిమ్రాన్ చెల్లెలు కన్నుమూత…
మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ
హిట్స్ లేవు, నెలకు రూ.5లక్షలు ఖర్చు..
చేపల వేటలో నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతా సిబ్బంది!
నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ
కవిత పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు
కవిత టీఆర్ఎస్ పార్టీని ఈసీ అనుమతించదు: బీఆర్ఎస్ నేత పటోళ్ల