విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50), రమ దంపతులు విభేదాలతో 20 ఏళ్ల కిందట విడిపోయారు.
రమ మైలారంలో ఉంటుండగా.. కుమారస్వామి తొర్రూరు పట్టణంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తొర్రూరు బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.. ఇతనే కుమారస్వామి అనుకోని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది, మృతదేహంపై లేకపోవడాన్ని గమనించారు. చివరికి మృతదేహం వేరే వ్యక్తిది అని గుర్తించి, నిన్న తిరిగి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సిబ్బంది రేపు రమ్మని పంపించారు. ఈరోజు కుటుంబసభ్యులు వెళ్లగా కుమారస్వామి బ్రతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంది తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్
చనిపోయాడనుకున్న కుమారస్వామి బ్రతికే ఉన్నాడు..వరంగల్ లో మృతదేహం మారిన ఘటనలో ట్విస్ట్

Latest News
భూ భారతిలో సవరణలకు మరో మూడు నెలలే.. ఏప్రిల్ 14 దాటితే దరఖాస్తులన్నీ బుట్టదాఖలు!
ఇవాళ ఇషాన్ – సూర్యల వంతు : రెండో టి20లోనూ భారత్ ఘన విజయం
దావోస్కు పోటెత్తుతున్న హైప్రొఫైల్ ఎస్కార్ట్స్! ఒక్క రాత్రి సుఖానికి 2,500 డాలర్లు! వైరల్ వీడియో సంచలనం!!
జాతర పనుల్లో జాప్యం!! అంతా ఆ సమ్మక్క, సారలమ్మలకే ఎరుక!
జంపన్నవాగులో ముగ్గురిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్
విజయానికి వయసు అడ్డుకాదు.. 70 ఏండ్ల వయసులో తొలి వ్లాగ్తో అదరగొట్టిన పెద్దాయన
నది జలాల హక్కుల సాధనలో ఏ పోరాటానికైనా సిద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సొంత రూల్స్ చెల్లవు...రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బిగ్ షాక్
తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్