విధాత, ఆదిలాబాద్: భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరుగా చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కాకుండా మండుటెండలతో అల్లతల్లడమైపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
వాతావరణశాఖ చల్లటి కబురు.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి

Latest News
కింగ్ కోబ్రా క్యాచింగ్.. బిగ్ డేరింగ్ !
తెలుగు రాష్ట్రాల ఆర్టీసీకి రికార్డు స్థాయిలో సంక్రాంతి రాబడి!
ఫ్రాన్స్పై ట్రంప్ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్లు విధిస్తానంటూ బెదిరింపులు
మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం..
దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీష్ రావు