అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19న వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో అవసరమున్న చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీకి భారీ వర్ష సూచన : ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరిక – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

Latest News
నకిలీ ట్రాఫిక్ చలాన్ మెసేజ్లు వస్తున్నాయి… అప్రమత్తంగా ఉండండి
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు : మంత్రి పొంగులేటి
కివీస్దే వన్డే సిరీస్ – కోహ్లీ శతక పోరాటం వృథా
తల్లుల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి
సక్సెస్తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరీ.
వార్తలు అడిగి రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
హీరోయిన్ ఎంగిలి తాగమన్న డైరెక్టర్..
భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ
మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
ఎవరి ప్రయోజనాల కోసమో నాపై కట్టుకథలు సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి ఫైర్