Site icon vidhaatha

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి కన్నబాబు

విధాత:వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచారు.జులై 22 వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా అనంతపురం,చిత్తూర్,కడప లో వర్షాలు పడ్డాయి
పశ్చిమ గోదావరి, కృష్ణ, కర్నూల్ లో అధిక వర్షపాతం నమోదైంది.రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో ముంపుకి గురయ్యాయి…. వర్షం నిలిస్తే ఆ నీరు పోయే అవకాశం ఉంది.వర్షాలు తగ్గితే పూర్తిగా ఎన్యుమరేషన్ చేస్తాం.రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తాం.ఈ వర్షాలు ఖరీఫ్ కు కలిసొచ్చే అంశం.

-మంత్రి కన్నబాబు

Exit mobile version