Manchiryala | ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: MLA దివాకర్‌రావు

Manchiryala రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశములో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదు దశాబ్దాల పాటు వ్యవసాయాన్ని తీవ్ర […]

  • Publish Date - July 17, 2023 / 10:14 AM IST

Manchiryala

  • రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  • మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు

విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశములో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదు దశాబ్దాల పాటు వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో వ్యవసాయం చేస్తున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు.
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మార్పు రాలేదని వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు మాత్రమే సరిపోతుందని చెప్పడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.

ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీలన‌ చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు.

నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు.

2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేస్తూనే ఉన్నార‌ని గుర్తు చేశారు.

Latest News