Warangal రైతన్న అభ్యున్నతి లక్ష్యం నర్సంపేటలో అభివృద్ధి పనులు ప్రారంభం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రైతు అభ్యున్నతే లక్ష్యంగా భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం ఫలితంగానే ఇవ్వాల లక్షలాది గ్రామాల్లో వ్యవసాయం పండుగగా మారిందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి పలు […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రైతు అభ్యున్నతే లక్ష్యంగా భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం ఫలితంగానే ఇవ్వాల లక్షలాది గ్రామాల్లో వ్యవసాయం పండుగగా మారిందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వేర్ హోసింగ్ కార్పొరేషన్ నిధులతో 1000 మెట్రిక్ టన్నుల గోడౌను ప్రారంభించారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 65 వేల కోట్లు రైతు బంధు, 5 వేల కోట్లు రైతు భీమా, సాగునీటి లక్ష 59 వేల కోట్లు, 10,000 కోట్లు మక్కల కొనుగోలు కోసం ఖర్చు చేసామని వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్దఎత్తున ఖర్చు పెట్టలేదన్నారు. వ్యవసాయ యాంత్రికరణ కోసం తప్పకుండ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంలు ఉండగా 9 సంవత్సరాలలో వాటిని 74 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కు పెంచామని చెప్పారు.
తెలంగాణ లో రైతు బంధు పథకం వల్ల ప్రతీ చేను పచ్చగా మారిందన్నారు. ప్రతీ మారుముల పల్లె ప్రాంతంలో రైతుల భూముల విలువలు గణనీయంగా పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు. రైతు బంధు, రైతు భీమా పథకాల గొప్పదనం ఐక్య రాజ్య సమితిలో మారుమోగుతున్నాయని గుర్తుచేశారు.
అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు మన రాష్ట్ర నిధులతోనే 10వేల రూపాయల నష్ట పరిహారం అందిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 70 కోట్ల నిధులు అందరికంటే ఎక్కువ తెచ్చుకున్నారని చెప్పారు.
కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్, జెడ్పి వైస్ చైర్మన్, ODCMS చైర్మన్, జెడ్పి ఫ్లోర్ లీడర్, ఎంపిపిలు, జడ్పిటిసిలు, వైస్ ఎంపిపిలు, ఎంపిటసిలు, సర్పంచ్ లు, PASC చైర్మన్లు, RSS కన్వీనర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ భాద్యులు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.