విధాత, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా మందసలోని నారాయణపురం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి పంచాయతీ(సచివాలయం) కార్యాలయంలోకి దూరింది. అటు నుంచి గ్రామంలోకి సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు ఎలుగు బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఎలుగు ఒకరిపై దాడి చేయడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. యువకులు గట్టిగా కేకలు వేయడంతో వెలుగు గ్రామం నుంచి దూరంగా వెళ్లింది. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎలుగు సంచారంపై గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంచాయతీ కార్యాలయంలో దూరిన ఎలుగుబంటి..జనం పరుగులు
శ్రీకాకుళం నారాయణపురంలో పంచాయతీ కార్యాలయంలో ఎలుగుబంటి దూరి, గ్రామస్తులు పరుగులు, ఒకరు స్వల్ప గాయాల తర్వాత ఆసుపత్రికి.

Latest News
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?
సాఫ్ట్వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ
కుసుమంచిలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. భూ రిజిస్ట్రేషన్లలో నూతన శకం
సభ్యులకు ఉద్దేశాలు ఆపాదిస్తారా? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సభా హక్కుల నోటీసు
కేసీఆర్ సభకు కేటీఆర్, హరీశ్.. సీఎం సభకు సురేఖ డుమ్మా వెనుక..
బెంగాల్ తొలి విడత..తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేసీఆర్ ఆదేశాలతోనే.. ఢిల్లీ వెళ్ళా : హరీశ్ రావు