విధాత, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా మందసలోని నారాయణపురం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి పంచాయతీ(సచివాలయం) కార్యాలయంలోకి దూరింది. అటు నుంచి గ్రామంలోకి సంచరిస్తూ కనిపించిన వారిపై దాడి చేసింది. దీంతో గ్రామస్తులు ఎలుగు బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఎలుగు ఒకరిపై దాడి చేయడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. యువకులు గట్టిగా కేకలు వేయడంతో వెలుగు గ్రామం నుంచి దూరంగా వెళ్లింది. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎలుగు సంచారంపై గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలుగును బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంచాయతీ కార్యాలయంలో దూరిన ఎలుగుబంటి..జనం పరుగులు
శ్రీకాకుళం నారాయణపురంలో పంచాయతీ కార్యాలయంలో ఎలుగుబంటి దూరి, గ్రామస్తులు పరుగులు, ఒకరు స్వల్ప గాయాల తర్వాత ఆసుపత్రికి.

Latest News
త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం: గవర్నర్ జిష్ణుదేవ్
వరల్డ్ వండర్...సౌదీ అరేబియా స్కై స్టేడియం
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు