విధాత, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చుపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు పరిష్కారానికి చొరవ చూపిన ఇద్దరు సీఎంలను అభినందించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభపరిణామం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు … సీపీఐ నేత నారాయణ
ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Latest News
రాజ్యసభకు సింఘ్వీ..వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవం
99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
క్రికెట్ విజయోత్సవంలో ‘మత’ విద్వేషం.. ఓ మతం జెండా పెట్టిన కొందరు.. అడ్డుకున్న మరో వర్గం
మా పిల్లలకు వైద్య వృత్తి వద్దే వద్దు.. ఎవరి మాటో తెలిస్తే షాకే!!
పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి ఖర్చుపై ఆసక్తికర వివరాలు..
ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జోరు..
ఆ స్టార్స్ ఎవరు మహిళల గురించి మాట్లాడలేదు, ఎన్టీఆర్ ఒక్కరే మాట్లాడారు..
ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ..
గల్ఫ్ దేశాల అసలు బలహీనత పడింది.. యుద్దంలో తాగునీటి ప్లాంట్లు కాపాడుకోవడమే మెయిన్ టాస్క్!