విధాత, హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చుపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు పరిష్కారానికి చొరవ చూపిన ఇద్దరు సీఎంలను అభినందించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ శుభపరిణామం, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దు … సీపీఐ నేత నారాయణ
ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య రాష్ట్ర విభజన సమస్యలపై చర్చలు జరగడం శుభపరిణామం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Latest News
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?