హైకోర్టులో ఏపీ డెయిరీ ఆస్తులపై విచారణ వాయిదా

విధాత,అమరావతి: ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎంపీ రఘురామ రాజు పిటిషన్‌ను వేశారు. డెయిరీ ఆస్తులని అమూల్ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం కెబినెట్ నిర్ణయం తీసుకుని ఈ నెల 19న జీవో 117 ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ కోపరేటివ్ లిమిటెడ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, ఇది రాజ్యాంగ […]

  • Publish Date - May 20, 2021 / 10:27 AM IST

విధాత,అమరావతి: ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎంపీ రఘురామ రాజు పిటిషన్‌ను వేశారు. డెయిరీ ఆస్తులని అమూల్ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం కెబినెట్ నిర్ణయం తీసుకుని ఈ నెల 19న జీవో 117 ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ కోపరేటివ్ లిమిటెడ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ తెలిపారు. జీవో సవాలు చేస్తూ పిటిషన్ వేశారా అని పిటిషనర్‌ని హైకోర్టు అడగ్గా పిటిషన్ వేసేటప్పటికి జీవో ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. జీవో సవాలు చేస్తూ అనుబంధ పిటిషన్ వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ… తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.