ఆపరేషన్ ముస్కాన్ లో కోవిడ్ బారిన పడకుండా చిన్నారులకు రక్షణ – డిజిపి గౌతమ్ సవాంగ్

విధాత:కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పలు నిర్ణయాలను ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యంగా అట్టి అనాధ పిల్లలకు తక్షణ వసతి కల్పించాలని, వారి పేరున 10,00,000 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని పిల్లల […]

  • Publish Date - May 21, 2021 / 12:11 PM IST

విధాత:కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పలు నిర్ణయాలను ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యంగా అట్టి అనాధ పిల్లలకు తక్షణ వసతి కల్పించాలని, వారి పేరున 10,00,000 రూపాయల మొత్తాన్ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వారి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని పిల్లల సంక్షేమమే పరమావదిగా పోలీసు శాఖ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో నిర్వహించిన మాదిరిగానే మరో సారి ఆపరేషన్ ముస్కాన్ కు శ్రీకారం చుట్టడం జరిగింది.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సవాంగ్ గారు ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించగా,అందుకనుగుణంగా జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది యావత్తు,కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీధి బాలలు, చిన్నారులు, బాల కార్మికుల విముక్తి కొరకై ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ ఆప‌రేష‌న్‌లో పోలీస్ శాఖ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు స్వచ్చందంగా పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జ‌న‌సామ‌ర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మాణ స్థలాలు, హోటళ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, వర్క్ షాపులు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీల వద్ద తనిఖీలు నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్గించడం జరిగింది. ఇందుకుగాను ప్రతి పోలీసు స్టేషన్ లో ఒక ప్రత్యేక టీమ్‌ల‌ను ఏర్పాటు చేయడం తోపాటు, ప్రతీ టీమ్‌లో మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టారు.

ఈ త‌నిఖీల సందర్బంగా గుర్తించిన పిల్లల ఫొటోలతో కూడిన సమాచారాన్ని ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు. ఆపరేషన్ ముస్కాన్ లో గుర్తించి స్వాదీనం చేసుకున్న పిల్లలను 24 గంటలలోపు ఆయా జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు అప్పగిస్తారు. చైల్డ్ వెల్ఫర్ కమిటీల ద్వారా దొరికిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడం, సరైన చిరునామా దొరకని పిల్లలను షెల్టర్ హోంలలో పునరావాసం కల్పించడం జరుగుతుంది.

మూడు రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ సందర్భంగా 8739 మంది చిన్నారులకు విముక్తి కలిగించడం జరిగింది. అందులో 7425 బాలలు మరియు 1314 బాలికలు వున్నారు. ఇందులో ఐదేళ్ల లోపు 205 మంది, 6 – 10 సంవత్సరాల లోపు 1860 మంది, 11 – 15 సంవత్సరాల లోపు 6674 మంది వున్నారు.

వీరిలో సిడబ్ల్యుసి ద్వారా 8,724 మందిని సంబంధిత తల్లిదండ్రులకు అప్పగించగా, 12 మందిని చైల్డ్ కేర్ హోంలకు, ముగ్గురిని కొవిడ్ కేర్ హోమ్ లో చేర్పించడం జరిగింది.

వీరిలో 5వ తరగతి వరకు చదువుకున్న వారు 2196 , పదో తరగతి వరకు చదువుకున్న వారు 5587 కాగా 725 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.

రెస్క్యూ చేసిన వీరిలో 4234 మంది కూలీ పని చేసుకుంటుండగా, 123 మంది యాచకులుగా ఉన్నారు. వీధి బాలలు 772 మంది కాగా 3565 మంది ఇతర వృత్తుల్లో ఉన్నారు .

వీరిలో 98 మంది బాలలు ఫిజికల్ డిపర్ట్మెటి కలిగి ఉండగా, 10 మంది మానసిక వైకల్యం కలిగి ఉన్నారు.

వీరిలో పేదరికం కారణంగా 5624 మంది, తల్లిదండ్రుల సంరక్షణ లేని కారణంగా 760 మంది, పరీక్షలు తప్పడం వల్ల 7 మంది మరియు ఇతర కారణాల వల్ల 2348 మంది వివిధ వృత్తుల్లో పని చేయుచున్నారు.

వీటిని పరిశీలించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కేసులు నమోదు చేయడం జరిగింది.

రెస్క్యూ చేయబడిన చిన్నారులలో ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు 2595 మంది, మైనారిటీ వర్గాలకు చెందిన వారు 1633, వెనుకబడిన కులాలకు చెందిన వారు 3536 మరియు 975 మంది ఓసీలు ఉన్నారు.

వీరిలో 8511 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కాగా 228 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు ఉన్నారు.

ఇది వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ లో 25000 పై చిలుకూ రెస్క్యూ చేయబడగా, అందులో 402 మంది చిన్నారులను మరల ఈ ఆపరేషన్ ముస్కాన్ లో గుర్తించడం జరిగింది.

కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్న 1982 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, టెస్ట్ ఫలితాలు వచ్చిన వారిలో 28 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినది. 1232 మంది చిన్నారులకు కోవిడ్ నెగిటివ్ గా గుర్తించడం జరిగింది. ఇంకా 722 మంది చిన్నారుల రిజల్ట్స్ రావాల్సి ఉంది.

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులు ముగ్గురు వున్నారు. వారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా పునరావాసం మరియు డబ్బు జమ చేయబడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

కోవిడ్ సోకిన అట్టి చిన్నారులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ ఇనిస్టిట్యూషన్ లకు తరలించడం జరిగింది. వారు పూర్తి గా కొలుకునేంత వరకు వారి సంరక్షణ భాధ్యతను తీసుకోవాలని డిజిపి గారు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించిన పోలీసు శాఖ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు.