విధాత: టీడీపీ హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని.. 20 ఏళ్ల క్రితం డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు ఏర్పాటు చేశారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. డ్వాక్రా గ్రూపులను ఈ ప్రభుత్వం నిర్విర్యం చేస్తోందని విమర్శించారు. మహిళా డబ్బులతో కూడా జగన్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు దాచుకున్న డబ్బును వాడుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ అమలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. రాజప్రసాదం నుండి చిలక బయటకి వచ్చిందని.. సీఎం జగన్ చిలక పలుకులు పలుకుతున్నారని యెద్దేవా చేశారు. మహిళా సాధికారతపైన సీఎం జగన్కు చిత్త శుద్ది లేదన్నారు. 45 ఏళ్ల మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీలను జగన్ విస్మరించారని అన్నారు. 98 లక్షల డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో ఉంటే..72 లక్షల మందికి అసరా పథకం ఇస్తున్నారని తెలిపారు. అమ్మవడి డబ్బులు..నాన్నబుడ్డీ పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో కరెంట్ బిల్ పట్టుకున్న షాక్ కొడుతోందన్నారు. ఫ్యాన్కి ఓటు వేసిన పాపానికి , ప్రజలు ఫ్యాన్ క్రింద కూడా కూర్చోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. అన్నిటి ధరలను పెంచి ప్రభుత్వం ఒక చేత్తో ఇస్తూ..మరో చేత్తో దోపిడీ చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు.
డ్వాక్రా గ్రూపులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
<p>విధాత: టీడీపీ హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని.. 20 ఏళ్ల క్రితం డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు ఏర్పాటు చేశారని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. డ్వాక్రా గ్రూపులను ఈ ప్రభుత్వం నిర్విర్యం చేస్తోందని విమర్శించారు. మహిళా డబ్బులతో కూడా జగన్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు దాచుకున్న డబ్బును వాడుకోవడానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. జగనన్న ఆసరా కాదు..జగనన్న దోపిడీ అమలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. రాజప్రసాదం నుండి […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు