Site icon vidhaatha

Gold-Silver Rates Hike | మహిళలకు షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Gold-Silver Rates Hike | మహిళకు బంగారం, వెండి ధరలు భారీ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో గురువారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగి తులానికి రూ.67వేలకు ఎగిసింది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.710 ఎగిసి తులానికి రూ.73,090కి చేరింది. ఇక వెండి ధర ఒకే రోజు రూ.1500 పెరగడంతో కిలోకు రూ.93వేలకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,750కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,090కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,240 పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,090 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు సైతం భారీగా పెరిగింది. కిలోకు రూ.1500 పెరిగి.. ఢిల్లీలో ధర వెండి రూ.93వేలకు చేరింది. హైదరాబాద్‌లో రూ.97,500 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

 

Exit mobile version