దీపావళి పండుగకు ముందు కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు శనివారం మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.300 పెరిగి తులానికి రూ.56వేలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.300 పెరగడంతో తులానికి రూ.61,090 చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,240కి పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,090కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,580 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,090 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి రూ.800 పెరగడంతో కిలోకు రూ.74వేలకు చేరింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77వేలు పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. బంగారం, వెండి ధరలు పెరగ్గా ప్లాటినం ధరలు సైతం భారీగానే తగ్గింది. రూ.370 తగ్గడంతో తులానికి రూ.22,940కి దిగివచ్చింది.