పుత్తడి కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన ధరలు మరోసారి పరుగులు తీస్తున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.110 పెరిగి తులానికి రూ.55,500కి పెరిగింది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.110 పెరిగి తులానికి రూ.60,600కు ఎగిసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,750కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,600కి పెరిగింది.
చెన్నై 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,090కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,600కి పెరిగింది. ఇక హైదరాబాద్లో ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,600 పలుకుతున్నది. ఏపీని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలోకు రూ.600 పెరిగింది. హైదరాబాద్లో కిలోకు రూ.76వేలు పలుకుతున్నది.