మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా మూడోరోజు స్వల్పంగా ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులానికి రూ.56,390 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.10 తగ్గి తులం రూ.61,520కి చేరింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,680కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,390 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,520కి తగ్గింది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,020కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,520కి చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.56,390 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,520 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి హైదరాబాద్లో రూ.77వేలు పలుకుతున్నది.