విధాత: బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్నిచ్చాయి. 22 క్యారెట్ల బంగారం గోల్డ్ రూ.1400 పెరిగి తులానికి రూ.55,400కి ఎగిసింది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.1530 పెరిగి తులానికి రూ.60,440 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,590కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,440 పలుకుతున్నది.
చెన్నైలో 22క్యారెట్ల స్వర్ణం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,600కి చేరింది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,440 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. రూ.1500 పెరిగి కిలోకు రూ.74,100కి ఎగిసింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77వేలకు చేరింది. మరో వైపు ప్లాటినం ధరలు విపరీతంగా పెరిగాయి. తులానికి 350 పెరిగి.. రూ.23,580 పలుకుతున్నది.