Gold Rates | బంగారం కొనుగోలుదారులకు తీపికబురు. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు గురువారం నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.70,600 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్ తులం రూ.77,020 వద్ద నిలకడగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,020 వద్ద నిలకడగా ఉన్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.70,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,170 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,020 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.70,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,020 స్థిరంగా ఉన్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో రూ.95వేలు పలుకుతున్నది. హైదరాబాద్లో కిలోకు రూ.1,01,000కి వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.