Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఎట్టేలకు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్నటి వరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా బులియన్ మార్కెట్లో ధరలు తగ్గాయి. శనివారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్పై రూ.700 తగ్గి.. తులానికి రూ.66,500కి తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.760 పతనమై 24 క్యారెట్ల పసిడి రూ.72,550కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,960కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,550కి తగ్గిది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,700కి పతనమైంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,550 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే తగ్గింది. రూ.1000 తగ్గి కిలోకు రూ.85,500కి దిగవచ్చిది. హైదరాబాద్లో కిలో ధర రూ.89వేలు ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.