బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. వరుసగా రెండోరోజు ధర పెరిగింది. బులియన్ మార్కెట్లో గురువారం 22 క్యారెట్ల గోల్డ్పై రూ.100 పెరిగి తులం రూ.56,650 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.110 పెరిగి తులానికి రూ.61,800కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,690 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్స్ పుత్తడి రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.56,650కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,950కి పెరిగింది. బెంగుళూరులో 22 క్యారెట్స్ బంగారం రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,800 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,800 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,500 పలుకుతున్నది.