Site icon vidhaatha

Electric SUVs in India | ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీల కోసం ఇండియా ఎదురుచూపులు

ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో భారత్(India)​ జోరందుకుంటోంది. మారుతి, మహింద్రా, టాటా, హ్యూండయ్​లు కొత్త ఎలక్ట్రిక్​ మాడళ్ల తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇందులో అది ప్రధానమైన బ్యాటరీ(Car Battery)పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తక్కువ చార్జింగ్​ సమయం, ఎక్కువ మైలేజీ అనేవే కరెంటు వాహనాల అతి ముఖ్యమైన అవసరం.

ఈ నేపథ్యంలో, రాబోతున్న కొన్ని ఎస్​యూవీలు  భారత్​లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటి గురించి భారతీయులు ఇంటర్నెట్​తో తెగ వెతుకుతున్నట్లు వెల్లడైంది. అన్నట్లు ఇవన్నీ భారత్​లో తయారయ్యేవే. తయారీవే. అన్నీ మేడ్​ ఇన్​ ఇండియా కార్లే. అవేంటో తెలుసా… మారుతి సుజుకీ ఈవీఎక్స్​, హ్యూండయ్​ క్రెటా ఈవీ, టాటా సియెరా ఈవీ, మహింద్రా ఎక్స్​యూవీ ఈ8, హోండా ఎలివేట్​ ఈవీ.

  1. మారుతి సుజుకీ ఈవీఎక్స్(Maruti Suzuli eVX):

మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2025లో భారత్​లో ప్రవేశపెట్టనుంది. 2025 జనవరి 17 నుండి 25 వరకు ఢిల్లీలొ జరగనున్న భారత్​ మొబిలిటీ ఎక్స్​పో‌–2025(Bharat Mobility Expo-2025)లో మారుతి అసలైన ఈవీఎక్స్​ను ప్రదర్శించనుంది. దీని కాన్సెప్ట్​ను 2022 ఆటో ఎక్స్​పోలో చూపించింది. ఈ మారుతి సుజుకి ఈవీఎక్స్​ మొదటగా యూరప్​, జపాన్​ మార్కెట్లలో ప్రవేశించనుంది. తర్వాత 2025 తొలి త్రైమాసికంలోనే భారత్​లో అమ్మకాలు మొదలవుతాయి.

  1. హ్యూండయి క్రెటా ఈవీ(Hyundai Creta EV):

హ్యూండయ్​ తన అత్యంత విజయవంతమైన మాడల్​ క్రెటాలో ఎలక్ట్రిక్ వర్షన్​ను తీసుకురాబోతోంది. ఈ ఎస్​యూవీని భారత్​, విదేశాల రోడ్లపై చాలాసార్లు పరీక్షించారు.  కొన్ని విడి భాగాలు పెట్రోల్​ బండివే అయినా, డిజైన్​పరంగా ఉత్తమంగా తీర్చిదిద్దారు. కోనా ఎలక్ట్రిక్​(Kona Electric)తో పవర్​కు సంబంధించి కొన్ని పోలికలుంటాయని ఊహిస్తున్నారు. 2025 తొలి అర్థసంవత్సరంలోనే ఈ ఎస్​యూవీ మార్కెట్లోకి రానుంది. భారత అభిమానులు బాగా ఎదురుచూస్తున్న ఎస్​యూవీల్లో ఇది ఒకటి.

  1. టాటా సియోరా ఈవీ(Tata Sierra EV):

టాటా మోటార్స్​ తన పాత హిట్​ మాడళైన సియెరా(Sierra)ను మళ్లీ కొత్త అవతారంలో ప్రవేశపెడుతోంది. ఈసారి ఎలక్ట్రిక్​ రూపంలో. టాటా సియెరా ఎలక్ట్రిక్ ఈవీ మొదటి లుక్​ను ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించింది. ఉత్పత్తికి వెళ్తున్న మోడల్​ను గతేడాది భారత్​ మొబిలిటీ ఎక్స్​పోలో ప్రదర్శించింది. 2026లో ఈ వాహనం విడుదల అవబోతోంది.

  1. మహింద్రా ఎక్స్యూవీ.8(Mahindra XUV.e8):

భారత్​ ఎదురుచూస్తున్నమరో ఎస్​యూవీ మహింద్రా ఎక్స్​యూవీ.ఈ8. మహింద్రా విడుదల చేయబోయే ఐదు విద్యుత్​ వాహనాల్లో ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎస్​యూవీ. ఇది మహింద్రా వారి అత్యంత విజయవంతమైన వాహనం ఎక్స్​యూవీ700(XUV700)కు విద్యుత్​ రూపం. కొలతలు, బయటి డిజైన్​, ఇంటీరియర్స్​ అన్నీ 700లానే ఉన్నాయి. కాకపోతే, చూట్టానికి అందంపరంగా కొన్ని మార్పులు చేసారు. ఇవే 700ను ఈ8ను వేరు చేస్తున్నాయి.  ఈ ఏడాది చివరికల్లా ఇది విడుదల కానున్నట్లు సమాచారం.

  1. హోండా ఎలివేట్ ఈవీ(Honda Elevate EV):

ఈ ఎలివేట్ ఈవీ భారత్​లోనే తయారై, విదేశాలకు ఎగుమతి కానుంది. ఇంది కాంపాక్ట్​ ఎస్​యూవీ(Compact SUV) మాడల్​. మూడేళ్లలో మార్కెట్లోకి తీసుకొస్తామని గతంలో ఈ జపాన్​ కార్​ మేకర్​ ప్రకటించింది. అయితే ఈ కార్​కు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి.

 

Exit mobile version