విధాత,శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 18 నుంచి భక్తులను స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఏడు విడుతలుగా గర్భాలయంలో అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. గతంలో మాదిరిగా 3 విడతలుగా బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. వేదాశీర్వచనాలు, నవావరణ పూజలు పునరుద్ధరిస్తున్నట్లు కూడా ఆలయ ఈవో తెలిపారు.