విధాత: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డఫో అమెరికాను వీడి, స్విట్జర్లాండ్కు రానున్నారు. యూనివర్శిటీలపై జరుగుతున్న అణచివేత నేపథ్యంలో వీరు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని వీడి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ యూనివర్సిటీలో చేరనున్నారు. 2019లో ఆర్థికవేత్త మైకేల్ క్రేమర్తో కలిపి బెనర్జీ, డఫోలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించిన విషయం విధితమే. పేదరిక నిర్మూలనలో ప్రయోగాత్మక పద్ధతి అన్న అంశంపై వారికి నోబెల్ వచ్చింది. వచ్చే ఏడాది జులై నుంచి జ్యూరిచ్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రం, వాణిజ్యం, ఇన్ఫార్మాటిక్స్ విభాగంలో అధ్యాపకులుగా వారు చేరనున్నారు. అమెరికా యూనివర్శిటీలలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ఉదారవాద మేధావులపై సాగిస్తున్న అణచివేత నేపథ్యంలో ఈ ఆచార్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. యూనివర్శిటీల నిధులకు కోత విధించడం, విమర్శలు చేసిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ విద్యార్థుల కోటాను 15 శాతానికి తగ్గించడం వంటి ట్రంపు చర్యలపై యూనివర్శిటీలు మండిపడుతున్నాయి.
Nobel Laureates Banerjee & Duflo To Leave US | అమెరికాను వీడనున్న నోబెల్ జంట
నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఈస్టర్ డఫో అమెరికా వీడి స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ యూనివర్శిటీలో చేరనున్నారు.

Latest News
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం..!
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !
ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి