విధాత: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డఫో అమెరికాను వీడి, స్విట్జర్లాండ్కు రానున్నారు. యూనివర్శిటీలపై జరుగుతున్న అణచివేత నేపథ్యంలో వీరు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని వీడి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ యూనివర్సిటీలో చేరనున్నారు. 2019లో ఆర్థికవేత్త మైకేల్ క్రేమర్తో కలిపి బెనర్జీ, డఫోలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించిన విషయం విధితమే. పేదరిక నిర్మూలనలో ప్రయోగాత్మక పద్ధతి అన్న అంశంపై వారికి నోబెల్ వచ్చింది. వచ్చే ఏడాది జులై నుంచి జ్యూరిచ్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రం, వాణిజ్యం, ఇన్ఫార్మాటిక్స్ విభాగంలో అధ్యాపకులుగా వారు చేరనున్నారు. అమెరికా యూనివర్శిటీలలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ఉదారవాద మేధావులపై సాగిస్తున్న అణచివేత నేపథ్యంలో ఈ ఆచార్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. యూనివర్శిటీల నిధులకు కోత విధించడం, విమర్శలు చేసిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ విద్యార్థుల కోటాను 15 శాతానికి తగ్గించడం వంటి ట్రంపు చర్యలపై యూనివర్శిటీలు మండిపడుతున్నాయి.
Nobel Laureates Banerjee & Duflo To Leave US | అమెరికాను వీడనున్న నోబెల్ జంట
నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఈస్టర్ డఫో అమెరికా వీడి స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ యూనివర్శిటీలో చేరనున్నారు.

Latest News
భారతీయ సినీ పరిశ్రమకు.. బల్గేరియా రెడ్ కార్పెట్!
విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
డాక్టర్ గా వైద్యం.. హీరోగా వినోదం అందించాలన్నదే నా ధ్యేయం! పవన్ మహావీర్
Privacy Victory: Telangana High Court Orders Social Media Platforms to Remove Survivor’s Identity
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!