- employees donation । వరద బాధితులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఒక్క రోజు వేతనం రూ. 100 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తమ వేతనం నుంచి ఒక్క రోజు జీతాన్ని మినహాయించుకొని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పంపించాలని తెలియజేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బ్రుందం సీఎస్ శాంతి కుమారికి కాన్సంట్ లెటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం తగిన సహాయక చర్యలను వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగిచిందన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
employees donation । వరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.100 కోట్ల విరాళం
తమ వేతనం నుంచి ఒక్క రోజు జీతాన్ని మినహాయించుకొని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పంపించాలని తెలియజేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బ్రుందం సీఎస్ శాంతి కుమారికి కాన్సంట్ లెటర్ ఇచ్చారు.

Latest News
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు
అమ్మ పేరుతో మొక్కలు నాటండి: పవన్ కల్యాణ్