థాయిలాండ్‌లో ఘోర ప్ర‌మాదం.. 14 మంది దుర్మ‌ర‌ణం

థాయిలాండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది అక్క‌డిక‌క్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

  • Publish Date - December 5, 2023 / 06:09 AM IST

విధాత‌: థాయిలాండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది అక్క‌డిక‌క్కడే ప్రాణాలు కోల్పోగా, మ‌రో 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. థాయిలాండ్‌లోని ప్ర‌చాప్ ఖైరి ఖాన్ ప్రావిన్స్‌లో ఓ బ‌స్సు 35 మందికి పైగా ప్ర‌యాణికుల‌తో వెళ్తుంది. అయితే బ‌స్సు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.


ఈ ప్ర‌మాదంలో 14 మంది మృతి చెంద‌గా, మ‌రో 20 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News