విధాత : అలంపూర్ బీఆరెస్ ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. తన సిటింగ్ స్థానాన్ని బీఆరెస్ ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి ఒత్తిడి మేరకు ఆయన అనుచరుడు విజయుడికి సీఎం కేసీఆర్ కేటాయించారు.
దీంతో అసంతృప్తికి గురైన అబ్రహం కాంగ్రెస్లో చేరారు. అబ్రహం చేరికతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంపత్కుమార్కు అదనపు బలం చేకూరనుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి