Bengaluru Terror Attack | బెంగ‌ళూరులో ఉగ్ర దాడికి య‌త్నం.. ఐదుగురు అనుమానితులు అరెస్ట్

Bengaluru Terror Attack విధాత‌: దేశ ఐటీ రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలో ఉగ్ర దాడుల‌కు జ‌రుగుతున్న కుట్ర‌లను సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ భ‌గ్నం చేసింది. ఈ కుట్ర‌కు సంబంధించి ఐదుగురు అనుమానితుల‌ను బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ స‌భ్యుల వ‌ద్ద ఉన్న పేలుడు ప‌దార్థాలు, మొబైల్స్, ఇత‌ర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఉగ్ర కుట్ర‌కు సంబంధించి మ‌రో ఐదుగురు అనుమానితుల కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 5 suspected terrorists planning […]

  • Publish Date - July 19, 2023 / 09:17 AM IST

Bengaluru Terror Attack

విధాత‌: దేశ ఐటీ రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలో ఉగ్ర దాడుల‌కు జ‌రుగుతున్న కుట్ర‌లను సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ భ‌గ్నం చేసింది. ఈ కుట్ర‌కు సంబంధించి ఐదుగురు అనుమానితుల‌ను బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ స‌భ్యుల వ‌ద్ద ఉన్న పేలుడు ప‌దార్థాలు, మొబైల్స్, ఇత‌ర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఉగ్ర కుట్ర‌కు సంబంధించి మ‌రో ఐదుగురు అనుమానితుల కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

బెంగ‌ళూరులోని ప‌లు ఏరియాల్లో ఉగ్ర దాడుల‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని సీసీబీకి ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించి, ఐదుగురు అనుమానితుల‌ను అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని సుహైల్, ఓమ‌ర్, జ‌హీద్, ముదాసీర్, ఫైజ‌ల్‌గా గుర్తించారు. వీరంతా బెంగ‌ళూరుకు చెందిన వారు కాగా, వ‌య‌సు 25 నుంచి 35 ఏండ్ల మ‌ధ్య ఉంటుంది.

అయితే ఇవాళ ఉద‌యం అరెస్టు అయిన ఐదుగురు వ్య‌క్తుల‌కు 2017లో జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో ప్ర‌మేయం ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 18 నెల‌ల పాటు బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైల్లో జైలు జీవితాన్ని గ‌డిపారు. 2019లో జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఈ మ‌ర్డ‌ర్ కేసులో బెంగ‌ళూరులోని సెంట్ర‌ల్ జైల్లో ఉన్న స‌మ‌యంలో ఈ ఐదుగురికి ఉగ్ర‌వాదుల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, ఆ స‌మ‌యంలోనే పేలుడు ప‌దార్థాలు ఎలా త‌యారు చేయాల‌ని, ఎలా దాడులు చేయాల‌ని నేర్చుకున్న‌ట్లు స‌మాచారం